మళయాళ నటుడు కళాభవన్ మణి కన్నుమూత:
మళయాళ నటుడు కళాభవన్ మణి (44) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొచ్చిలోని అమ్రిత ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. అత్యవసర చికిత్సకై ఐసీయూలో వైద్యులు చికిత్స చేశారు. అయితే 7:15 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులు చెప్పారు.
200పైగా చిత్రాల్లో మణి నటించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. మళయాళ సినిమాల్లోనే కాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించారు. తెలుగులో కళాభవన్కు 'జెమిని'తో మంచి పేరు వచ్చింది. అర్జున్, నరసింహుడు, ఎవడైతే నాకేంటి? చిత్రాల్లో మణి నటించారు.