ఫ్లిప్కార్ట్లో లీఎకో సంచలనం
న్యూఢిల్లీ: చైనాకు చెందిన లీఎకో కంపెనీ ఫ్లిప్కార్ట్లో సంచలనం సృష్టించింది. సోమవారం కంపెనీ తాజా ఆవిష్కరణ ఎల్ఇ 1ఎస్ మొబైల్ విక్రయాలు ప్రారంభంఅయిన 2 సెకన్లలోనే 70 వేల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ మొబైల్ కోసం ఇప్పటికే 6.5 లక్షల మంది బయ్యర్లు ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఫ్లిప్కార్ట్లో ఏ బ్రాండ్కు ఇంత స్పందన రాలేదు. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని లీఎకో ఇండియా సిఇఒ అతుల్ జైన్ చెప్పారు. ఫిబ్రవరి 9న మరోసారి ఎల్ఇ 1ఎస్ను ఆన్లైన్లో విక్రయిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరకు భారతలో టాప్3 మొబైల్ విక్రేతల్లో ఒకరుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.




